- Advertisement -

బంజారాహిల్స్ పీఎస్‌లో ఈషా రెబ్బా ఫిర్యాదు

- Advertisement -

బంజారా హిల్స్ పోలీసులను హీరోయిన్ ఈషా రెబ్బా ఆశ్రయించారు. తనపై సోషల్ మీడియాలో వస్తున్న అసభ్యకరమైన వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఇటీవల తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన ఒక పోస్ట్‌కు సంబంధించి, ఓ వ్యక్తి హద్దు మీరిన రీతిలో అసభ్య వ్యాఖ్యలు చేశాడని ఈషా రెబ్బా పోలీసులకు వివరించారు. ఇటువంటి కామెంట్లు తనను మానసికంగా వేధిస్తున్నాయని, మహిళగా తన గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి దూషణలు పెరుగుతున్నాయని, ఇది ఆందోళనకర పరిణామమని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ఫిర్యాదు స్వీకరించిన బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. సోషల్ మీడియాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే సందేశాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -