- Advertisement -
అజ్ఞాతవాసి ఫ్లాపుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ కోలుకొని తన తర్వాతి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఓ స్టార్ హీరో సినిమాతో చేస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతుంది.
కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించనున్నఈ సినిమా షూటింగ్ మార్చి 23వ తేదీ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను జూలై నాటికి పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు. అన్నీ పూర్తి చేసి ఈ సినిమాను ఈ దసరా పండుగకు విడుదల చేసే ఉద్దేశంలో చిత్ర బృందం ఉంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. ఈ చిత్రం షూటింగ్కు సంబంధించిన విషయాలను అధికారికంగా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.