Sunday, May 19, 2024
- Advertisement -

కేసీఆర్ కంటే రాంచరణ్‍ ఫస్ట్.

- Advertisement -

 

నిజామాబాద్ జిల్లా దోమకొండ గడికోటలోని మహాదేవును ఆలయంలో జరిగిన మహేరుద్ర శత చండీయాగంలో రాంచరణ్‍ తేజ, ఆయన భార్య ఉపాసన పాల్గొన్నారు. ఐతే ఈ చండీయాగం పది రోజులుగా జరుగుతుంది.

చివరి రోజున రాంచరణ్‍ తేజ, ఉపాసన యాగంలో పాల్గొని పూజలు చేశారు. మహాదేవుని ఆలయంలో ప్రత్యేకంగా శివుడికి రుద్రాభిషేకం చేశారు. శత చండీయాగంలో  పూజలు చేయడం  నాకు చాలా సతోషంగా ఉందని రాంచరణ్ తెలిపారు.

ఈ యాగంలో గొప్ప గొప్ప పండితులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం చరణ్ దోమకొండ గ్రామ పంచాయితీ వారికి 16 చెత్త బండ్లను పంపిణీ చేశారు. గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తామని రాం చరణ్ తెలిపారు. అక్కడి ప్రజలు రాం చరణ్ పట్ల అనందం వ్యక్తం చేశారు.  

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం చండీయాగం చేయనున్నారు. అందుకోసం ఇప్పటికే పలువురి ప్రముఖులను ఆహ్వానించడం జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -