శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించిన మొదటి సినిమా ట్రైలర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. జాన్వీ కపూర్,ఇషాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ధడక్స.ఈ సినిమాతో ఇండస్ట్రీకి పరిచియమవుతుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్.ఈ రోజు(సోమవారం) సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.ట్రైలర్ ఫస్టాఫ్ లో అందంగా సాగిపోయిన వాళ్ల ప్రేమకథ .. ఆ తరువాత ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొందనేది చూపించారు.సున్నితమైన భావోద్వేగాలపై ట్రైలర్ కట్ చేశారు.
జాన్వీ కపూర్ ప్రతి ఫ్రేమ్ లోను చాలా అందంగా కనిపిస్తోంది. జాన్వీ నటనలో ఎక్కడా తడబాటు కనిపించకపోవడం విశేషం. చ్చేనెల 20వ తేదీనఈ సినిమ ప్రేక్షకుల ముందుకు రానుంది.మరాఠీ మూవీ సైరత్ సినిమాను హిందిలో రీమేక్ చేస్తున్నారు.జాన్వీ కోసం ప్రత్యేకంగా ఈ సినిమాను ఎంపిక చేసింది శ్రీదేవి.మరాఠీలో ఈ సినిమా ఘనవిజయం సాధించింన సంగతి తెలిసిందే.
