ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత కథను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను ఆయన తనయుడు హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తు,నిర్మిస్తున్నారు.ఈ సినిమా క్రిష్ చేతుల్లోకి వెళ్లిన దగ్గర నుండి సినిమా రూపు రేఖలు మారిపోయ్యాయి.సినిమాలో నటీనటులను ఫేం ఉన్న స్టార్స్ని తీసుకోవడం ద్వారా సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే సినిమాలో విద్యాబాలన్,మెహన్ బాబు,సుమంత్,రకుల్,కాజల్ను తీసుకున్న క్రిష్ ,తాజాగా సీనియర్ నటి జయప్రద పాత్ర కోసం హీరోయిన్ రాశిఖన్నాని తీసుకున్నారని సమాచారం.
సీనియర్ ఎన్టీఆర్-జయప్రదలు కలిసి కొన్ని సినిమాలు చేశారు.ఎన్టీఆర్ బయోపిక్లో ఆమె పాత్రం ఉండలనే ఉద్దేశంతో క్రిష్ రాశిఖన్నాని సంప్రదించారని తెలుస్తుంది.కాని దీనిపై రాశీ ఖన్నా ఎటువంటి డేసిషన్ తీసుకోలేదటా.సినిమాలో ఆమె కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉంటుందని సమచారం.దీంతో ఆమె ఈ సినిమాను ఒప్పుకోవాలా? వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక ఆగస్టు 15న సం స్వాతంత్య దినోత్సవ సందర్భంగా ఈ సినిమాలో ఫస్ట్ లుక్ని విడుదల చేశారు చిత్ర యూనిట్.ఫస్ట్ లుక్ చూసిన వారందరు ఒక సెకను పాటు ఆగి అది ఎన్టీఆరా లేక బాలకృష్ణనా అనే సందేహంతో చూశారు.అంతలా బాలకృష్ణ ఎన్టీఆర్లా మారిపోయాడు.సినిమా ఫస్ట్ లుక్ బయటికి వచ్చిన దగ్గర నుండి ఎన్టీఆర్ బయోపిక్పై అంచనాలు భారీగా పెరిగాయి.