నందమూరి తారక రామారావు జీవిత కథను ఎన్టీఆర్ పేరుతో సినిమాగా తెరకెక్కిస్తున్నారు. క్రిషం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ తనయుడు హీరో బాలకృష్ణ నటిస్తు,నిర్మిస్తున్నారు.ఈ బయోపిక్ ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాలో నందమూరి కుటుంబ హీరోలందరు నటిస్తున్న సంగతి తెలిసిందే.ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప.ఇక గతంలో బాలకృష్ణ కుటుంబానికి ,హరికృష్ణ కుటుంబానికి మధ్య సంబంధాలు సరిగ లేవని అందరికి తెలిసిందే.దీనిలో భాగంగానే బాలకృష్ణ ,జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టేశారు.కాని ఇటీవలే హరికృష్ఱ మరణించడంతో వారి కుటుంబానికి అండగా నిలిచారు బాలకృష్ణ.ఇక నిన్న జరిగిన ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు.
దీంతో వీరి మధ్య గొడవలు తొలగిపోయ్యాయని అభిమానులు చర్చించుకుంటున్నారు.ఇక ఎన్టీఆర్ బయోపిక్లో తారక్ని తీసుకుంటున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ స్పందించలేదు.బయోపిక్లో ఎన్టీఆర్ నటించే పాత్రలు లేవని సమాచారం.ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ కి రావల్సినంత బజ్ వచ్చేసింది. రెండు పార్టులుగా చిత్రీకరిస్తున్నారు కాబట్టి రాబడి కూడా అదే రేంజ్ లో ఉంటుంది.ఇప్పుడు కొత్తగా తారక్ ని సీన్ లోకి తీసుకొచ్చి క్యాష్ చేసుకునే ఆలోచన బాలయ్యకి కానీ, దర్శకుడికి కానీ లేదని అంటున్నారు. దీనిని బట్టి చూస్తే ఎన్టీఆర్ బయోపిక్లో తారక్ను చూడటం కష్టమే అని చెప్పాలి.