- Advertisement -
ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రేపు విడుదల కావాల్సిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు బ్రేక్ వేసింది. 29 నవిడుదల చేయరాదంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15వ తేదీ వరకు సినిమా విడుదలను ఆపుచేయాలని ఆదేశించింది.
15 /4 /2019 వరకు సినిమా హాళ్లలో ప్రదర్శన కానీ, సోషల్ మీడియా ఫ్లాట్ఫార్మ్స్ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ తదితర మీడియాల్లో కూడా సినిమా ప్రదర్శించొద్దని స్పష్టం చేసింది.రాంగోపాల్ వర్మ, రాకేష్ రెడ్డి , అగస్త్య మంజు తదితరులకు నోటీసులు పంపాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. డైరెక్టర్ వర్మ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.