వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర 2 సినిమా త్వరలో తెరమీదకు రానుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ‘యాత్ర’ చిత్రాన్ని తెరకెక్కించిన మహి వీ రాఘవ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో ప్రకటించారు.
ఈసినిమాకు సంబంధించి అఫిషియల్గా జగన్ సొంత పార్టీ పెట్టినప్పటినుంచి సీఎం .ఇటీవల మమ్ముట్టి హీరోగా దర్శకుడు మహీ వీ రాఘవ వైఎస్ రాజశేఖర రెడ్డి బయోపిక్ ‘యాత్రస సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇదే స్పూర్తితో యాత్ర 2 తీసేందుకు సిద్దమవుతున్నారు.
వైఎస్ఆర్ కథ రాజారెడ్డి, జగన్ లేకుండా అసంపూర్తేనని వ్యాఖ్యానించిన ఆయన, ‘యాత్ర-2’ కథలో వీరిద్దరివే ప్రముఖ పాత్రలని చెప్పారు. ‘యాత్ర’ సినిమాను వైఎస్ జగన్ ను చూపిస్తూ ముగించడానికి కారణం కూడా ఇదేనని, ఆ చిత్రంలో తామెక్కడ సినిమాను ముగించామో, అక్కడి నుంచి కొత్త సినిమా ప్రారంభం అవుతుందని అన్నారు.
రాజశేఖర్ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ.పావురాల గుట్ట దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. తన తండ్రి మరణం తట్టుకోలేక రాష్ట్రంలో వందల మంది చనిపోయిన సంగతి తెలిసిందే. జగన్ ఓదార్పు యాత్రనుంచి మొదైన కష్టాలు 9 ఏళ్ల పోరాటం తరువాత అఖండ విజయం సాధించటం లాంటి అంశాల నేపథ్యంలో సీక్వెల్ సాగుతుందని అంచనా వేస్తున్నారు.