క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును దిగ్గజ క్రికెటర్లు ప్రకటించడం మామూలే. టోర్నీలో ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా తన డ్రీమ్ ఎలెవన్ టీమ్ని ప్రకటించారు సచిన్ టెండుల్క్ర్. అయితే ప్రపంచకప్లో పేవల ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న ధోనిని పక్కన బెట్టారు.
జట్టులోకి విరాట్ కోహ్లీని ఎంపిక చేసినా.. అతనికి టీమ్ కెప్టెన్సీ ఇవ్వలేదు. సోమవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన ఎలెవన్ జట్టులోనూ ధోనీకి చోటు దక్కని విషయం తెలిసిందే. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్కు తన జట్టు సారథిగా ఎంపిక చేసిన సచిన్.. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, బుమ్రాలకు భారత్ నుంచి చోటు కల్పించాడు. ఇంగ్లండ్ నుంచి బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, బెయిర్ స్టోలను ఎంపిక చేసిన సచిన్.. బంగ్లాదేశ్ నుంచి షకీబుల్ హసన్కు తన జట్టులో అవకాశం ఇచ్చాడు. ఆసీస్ నుంచి మిచెల్ స్టార్క్ను మాత్రమే తన అత్యుత్తమ వరల్డ్కప్ ఎలెవన్ జట్టులో చోటిచ్చాడు.
2019 క్రికెట్ వరల్డ్కప్ సచిన్ ఎలెవన్ ఇదే..
కేన్ విలియమ్సన్(కెప్టెన్), రోహిత్ శర్మ, బెయిర్ స్టో(వికెట్ కీపర్), విరాట్ కోహ్లి, షకీబుల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, బుమ్రా, జోఫ్రా ఆర్చర్