ప్రస్తుతం సోషల్ మీడియాలో కోహ్లీ, రోహిత్ మధ్య ఉన్న విబేధాలు జట్టులో ప్రకంపనలు రేపుతున్నాయి. ప్రపంచకప్ వైఫల్యం తర్వాత వీరి మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఇంగ్లాండ్ లో వరల్డ్ కప్ సెమీస్ ఓటమి తర్వాత భారత జట్టుకు విమాన టికెట్లు దొరక్కపోవడంతో ఓ వారం రోజులపాటు ఆటగాళ్లు అక్కడే ఉండాల్సి వచ్చింది. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం టీమ్ తో పనిలేకుండా అందరికంటే ముందే భారత్ చేరుకున్నాడు.
దీంతో వీరి మధ్య విబేధాలు బయటపడ్డాయి. విబేధాలు నిజమనే దానికి కొన్ని సంఘటనలు కూడా సోషల్ మీడియాలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో వార్త తెరపైకి వచ్చింది. ఇద్దరి మధ్య విబేధాలకు కారణం అంబటిరాయుడు అనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది.
ప్రపంచకఫ్ జట్టు ఎంపికలో అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంతోనె వీరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. వరల్డ్ కప్ కు రాయుడ్ని ఎంపిక చేయాలంటూ రోహిత్ పట్టుబట్టగా, అసలే ఫార్మాట్ లోనూ తనను తాను నిరూపించుకోని విజయ్ శంకర్ కోసం కోహ్లీ పట్టుదల ప్రదర్శించినట్టు తెలుస్తోంది. జట్టు వ్యూహాల్లో కూడా కోహ్లీ, రవిశాస్త్రి తనను పట్టించుకోవడంలేదని రోహిత్ అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మరో వైపు సెమీఫైనల్లో ధోనిని 7 డో స్థానంలో పంపించడంపై కూడా రోహిత్ ను ఆగ్రహానికి గురిచేసిందనె ఆర్తల ప్రచారం జరుగుతోంది.