ప్రస్తుతం సినిమా బాగుంటే మన టాలీవుడ్ హీరోలు వంద కోట్లు చాలా సింపుల్ గా దాటేస్తున్నారు. దీనితో టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీల పారితోషకాలు సైతం చుక్కల్లో ఉంటున్నాయి. సినిమా బడ్జెట్ లో 30 నుండి 40 శాతం హీరో రెమ్యూనరేషన్ కే పోతుంది. ప్రస్తుతం మన స్టార్స్ తీసుకునే రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
ప్రభాస్ : ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. సాహోకి కుడా 50కోట్లు తీసుకున్నాడు.
మహేష్ : సరిలేరు నీకెవ్వరు చిత్రానికి మహేష్ కూడా 50కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు తెలుస్తుంది. సినిమా బడ్జెట్ ను బట్టి మహేష్ రెమ్యునరేషన్ ఉంటుందని తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ : వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ తో పాటు దర్శకుడు క్రిష్ తో ఒక చిత్రం, హరీష్ శంకర్ తో మరొక చిత్రం ఒప్పుకున్నారు. పవన్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 50కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎన్టీఆర్ : ఎన్టీఆర్ కుడా అరవింద సామెత కు 50కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఆర్ ఆర్ ఆర్ కు మరింత ఎక్కువే అందుకుంటున్నాడట.
అల్లు అర్జున్: ఇక అల వైకుంఠపురంలో విజయం తరువాత బన్నీ కూడా సుకుమార్ చిత్రం కొరకు 30-35 కోట్ల వరకు తీసుకునే అవకాశం కలదు.
రామ్ చరణ్ : ప్రస్తుతం సినిమాకు 25-28 వరకు తీసుకుంటున్న రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు 50కోట్ల వరకు తీసుకుంటున్నారట.
బాలకృష్ణ : అయన సినిమాకు 12కోట్ల పారితోషికం అందుకుంటున్నారు.
వెంకటేష్ : వెంకటేష్ పారితోషికం కూడా 12కోట్ల వరకు ఉంది.
విజయ్ దేవరకొండ : వరుస పరాజయాలు ఎదుర్కుంటున్న ఈ హీరో 6 కోట్లలోపే పారితోషకం తీసుకుంటున్నాడట.
నాగార్జున : నాగార్జున ఒక్కో సినిమాకు 7.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.