పవర్స్టార్ పవన్కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల చేశారు.అయితే దీనికి సంబందించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.పవన్కళ్యాణ్ తన వెరిఫైడ్ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఎప్పుడూ సినిమాలకి సంబంధించిన ట్వీట్లు వేయలేదు. పూర్తిగా రాజకీయాలకే పరిమితం చేసిన తన ట్విట్టర్ అకౌంట్నుంచి సినిమాల గురించి ట్వీట్ చేయవద్దని పవన్ ముందే ఫిక్స్ అయిపోయాడు. ఇన్నాళ్లు దానికే కట్టుబడి వున్నాడు. అయితే ఈసారి అజ్ఞాతవాసి ప్రమోషన్ల కోసం త్రివిక్రమ్ నుంచి ఒత్తిడి రావడంతో మరో కొత్త అకౌంట్ ఓపెన్ చేసి దాన్నుంచి సినిమా ట్వీట్లు వేస్తానని చెప్పాడు.
పవన్ మరో అకౌంట్ ఓపెన్ చేసాడనగానే లక్షల మంది వచ్చి ఫాలో అయిపోతారని అనుకున్నారు. కానీ ఆల్రెడీ పవన్కో అకౌంట్ వుండడంతో ఈ కొత్త అకౌంట్కి స్పందన చాలా సాధారణంగా వుంది. ఇంతవరకు యాభై వేల పైచిలుకు ఫాలోవర్లు మాత్రమే వచ్చారు. ఇదిలావుంటే ఈ కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి మరో కారణం కూడా వుందని తెలిసింది. పవన్ ఇకపై నిర్మాతగా బిజీ కాబోతున్నాడు.
అందుకే తన సినిమాలకి సోషల్ మీడియా ప్రమోషన్కి హెల్ప్ అవుతుందని ఈ అకౌంట్ని అఫీషియల్ చేసాడు. అందుకే పేరు కూడా పికెక్రియేటివ్ వర్క్స్ అని పెట్టారట. ఏదేమైనా తెలుగు హీరోల్లో రెండు అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లు వున్న హీరోగా పవన్ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. అసలు సోషల్ మీడియాకే రానన్న హీరోకి ఇప్పుడు రెండు అకౌంట్లు వుండడం విశేషమే కదూ.ఇదీలా ఉంటే అజ్ఞాతవాసి ఫస్ట్ లుక్ పోస్ఠర్కి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఇలా మరోక ట్విట్టర్ ప్రారంభించి ప్రమోషన్స్ సక్సెస్ చేద్దాం అనే ఆలోచనతో ఉన్నారు పవన్కళ్యాణ్.