Friday, April 19, 2024
- Advertisement -

చిరంజీవి -బాబీ ప్రాజెక్ట్.. ఇవాళ సాయంత్రమే అనౌన్స్ మెంట్..!

- Advertisement -

ఇవాళ్టితో మెగాస్టార్ చిరంజీవి 66 వసంతంలోకి అడుగుపెట్టాడు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆయన కొత్తగా చేస్తున్న సినిమాలకు సంబంధించి అప్డేట్స్ క్యూ కడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళా శంకర్ అనే సినిమా చేస్తున్నట్లు అఫీషియల్ గా ప్రకటన వచ్చింది. దీంతోపాటు ఇవాళ సాయంత్రం కూడా చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించి అప్డేట్ రానుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం 4:05 గంటలకు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. మెగా వేవ్ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ కూడా విడుదల చేశారు.

చిరంజీవి 154వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ అనే టైటిల్ పెట్టినట్లు ఇప్పటికే ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి సర్ప్రైజ్ రానుంది. వెంకీ మామ సినిమా తర్వాత బాబీ మరో సినిమా చేయలేదు. చిరంజీవి సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తూ వచ్చారు. బాబీ చిరంజీవి కోసం పక్కా మాస్ కథ సిద్ధం చేసినట్లు సమాచారం.

ఈ సినిమాకు వాల్తేర్ వీరయ్య అనే టైటిల్ కూడా పెడతారనే ప్రచారం జరుగుతోంది. ఇదే టైటిల్ కన్ఫర్మ్ చేస్తారా లేదా మరొకటి పెడతారా.. అన్నది ఇవాళ సాయంత్రం తేలిపోనుంది. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి కూడా ఇవాళ ఏ దైనా ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. చిరంజీవి కొత్త సినిమాలకు సంబంధించిన కబుర్లు వరుసగా వస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Also Read: పూజ హెగ్డేపై రోజా భర్త ఘాటు విమర్శలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -