ప్రముఖ నటుడు రంగనాథ్ అనుమానాస్పద మృతి చెందారు. దాదాపు 300 లకు పైగా సినిమాల్లో రంగనాథ్ నటించారు. 1949వ సంవత్సరంలో మద్రాస్ లో జన్మించారు. రంగనాథ్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సినిమాల్లోకి రాకముందు రైల్వేలో టీసీగా పని చేశారు.
ఆయనది బలవన్మరణం అని తెలిశాక యావత్ సినీ రంగం ఉలిక్కిపడింది. హైదరాబాద్లోని కవాడిగూడలో నివాసముంటున్న రంగనాథ్ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాకాలం క్రితమే భార్యను కోల్పోయిన ఈ నటధీరుడు ఒంటరితనంతో బాధపడుతున్నాడు. ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నా వారెవరూ ఆయన మదిలోయల్లో గూడుకట్టుకున్న బాధను దూరం చేయలేకపోయారు.
బాధతో కుమిలిపోతున్న తనను వృద్ధాప్య దశలో అక్కున నిలిచి ఓదార్చేవారు లేకనే ఆత్మహత్యకు పాల్పడ్డాడని సమాచారం. రంగనాథ్ మృతితో సినీ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఒక అద్భుత నటుడిని కోల్పోయామని సహచరులు అన్నారు.
అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన సీనియర్ నటుడు రంగనాత్ భౌతికకాయానికి గాంధీ ఆసుపత్రిలో శవపరీక్ష పూర్తయ్యింది. అనంతరం ఆయన మృతదేహాన్ని ఫిలిం ఛాంబర్ కు తరలించారు.