Sunday, May 19, 2024
- Advertisement -

బెల్లంకొండ మ‌రో సినిమా మొద‌లెట్టేశాడుగా..!

- Advertisement -

నిర్మాత కొడుకుగా ఇండ‌స్ట్రీకి ప‌రిచియ‌మైన బెల్లంకొండ శ్రీనివాస్ వ‌రస సినిమాలు చేస్తు బిజీగా ఉన్నాడు.స్టార్ డైరెక్ట‌ర్ వివి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుడు శీను సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచిమైయ్యాడు నిర్మాత బెల్లంకొండ సురేష్ బాబు కొడుకు బెల్లంకొండ శ్రీనివాస్.ఈ సినిమాతో ఫైట్లు,డ్యాన్స్‌లు బాగా చేస్తాడ‌నే పేరు సంపాందించాడు బెల్లంకొండ శ్రీనివాస్.త‌రువాత వ‌చ్చిన స్పీడున్నోడు సినిమా నిరాశ ప‌రిచిన్న‌ప్ప‌టికి,మాస్ ద‌ర్శ‌కుడు బోయ‌పాటితో జయ జానకీ నాయకా సినిమాతో తాను క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ‌గ‌ల‌న‌ని నిరుపించుకున్నాడు.

ఈ సినిమా త‌రువాత శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో సాక్ష్యం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా విడుద‌ల కాక‌ముందే మ‌రో సినిమాను మొద‌లు పెట్టాడు.ద‌ర్శ‌కుడు తేజాతో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌.ఈ సినిమాలో హీరోయిన్‌గా కాజ‌ల్ అగర్వాల్ న‌టిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఈ రోజే(సోమ‌వారం)ప్రారంభం అయింది. దర్శకుడు వినాయక్ క్లాప్ కొట్టి సినిమాను లాంచ‌నంగా ప్రారంభించారు.అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -