నటి శ్రీరెడ్డి వ్యవహరంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు దగ్గుబాటి అభిరాం. అప్పటికి వరకు దగ్గబాటి సురేష్కి ఇద్దరు కకొడుకులు ఉన్నారని చాలామందికి తెలియదు.రానా బాగా ఫేమస్ కావడంతో సురేష్ బాబుకి ఒక్కరే కొడుకు అయి భావించారు.శ్రీరెడ్డి ఉదతంతో ఒక్కసారిగా లైఫ్లైన్లోకి వచ్చాడు.శ్రీరెడ్డి ,అభిరామ్ వారిద్దరూ సన్నిహితంగా ఉన్న కొన్ని ఫోటోలను సైతం రివీల్ చేసింది.ఈ విషయాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన కొందరు దుండగులు అభిరామ్ ఫోన్ ను తస్కరించడానికి ప్లాన్ చేశారు.
ఆ ఫోన్ లో డేటాను బట్టి అభిరామ్ దగ్గర నుండి డబ్బు గుంజాలని అనుకున్నారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ ఈ–మెయిల్ ఐడీని క్రియేట్ చేసి, దాని నుంచి గత నెల 24న అభిరామ్కు మెయిల్ పంపారు. ఆ ఫొటోలు, వీడియోల విషయం ప్రస్తావిస్తూ వాటిని సోషల్ మీడియాలో పెడతామని,అవి బయటపెట్టకుండా ఉండాలంటే తమకు రూ.1.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.దీంతో సురేష్ బాబు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు ఇన్వెస్టిగేట్ చేసిన పోలీసులు నలుగురుని బాధ్యులుగా గుర్తించి అరెస్ట్ చేశారు.