- Advertisement -
టాలీవుడ్కు చెందిన ఓ వర్థమాన నటుడు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారనే వార్త చర్చనీయాంశంగా మారింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే…నిమజ్జనం చూడడానికి వచ్చిన కొందరు అమ్మాయిలను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించిన నటుడుని న్యాయస్థానం శిక్షించింది.గత నెలలో జరిగిన గణేష్ నిమజ్జనం చూడడం కోసం ట్యాంక్బండ్ కి వచ్చిన అమ్మాయిలను నటుడు పి.కృష్ణ, వీడియో తీశాడు.
అది గమనించిన షీటీమ్ అతడిని పట్టుకున్నారు. అలానే మరికొంతమంది యువకులు అమ్మాయిల పర్మిషన్ లేకుండా వారి వీడియోలను చిత్రీకరించారు.ట్యాంక్బండ్పై అమ్మాయిలని వెకిలి చేష్టలతో వేధిస్తున్న కృష్ణను అక్కడే ఉన్న షీటీమ్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చింది.వీరికి రెండు రోజుల పాటు సామాజిక సేవ చేయించి రూ.100 జరిమానా విధించింది కోర్టు.