Saturday, May 18, 2024
- Advertisement -

నటి చార్మి సంచలన నిర్ణయం..

- Advertisement -

తెలుగు ఇండస్ట్రీలో కృష్ణ వంశి తెరకెక్కించిన శ్రీ ఆంజనేయం చిత్రంలో తన గ్లామర్ షో తో కుర్రాళ్ల మనసు దోచింది చార్మి. అంతకు ముందు నటించిన మూవీలకు రాని క్రేజీ ఈ చిత్రంతో వచ్చింది. తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది. నటిగానే కాకుండా ఐటమ్ సాంగ్స్ తో కూడా అలరించింది. గత కొంత కాలంగా నటనకు దూరంగా ఉంటూ వస్తున్న ఈ బ్యూటీ దర్శకనిర్మాత పూరీ జగన్నాథ్ తో కలిసి నిర్మాణ రంగంలోకి దిగింది.

నిర్మాణ రంగంలోకి దిగిన తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తూ వచ్చింది. అయితే చార్మి ఇప్పుడు ఎవరూ ఊహించని విధమైన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు దూరంగా ఉండనున్నట్టు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది.

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కరోనా వార్తలు, దృష్యాలు చూడలేక పోతున్నా అని.. తన మనసు సున్నితమైనదని.. కరోనా పరిస్థితులను చూసి తట్టుకునే పరిస్థితి తనకు లేదని… అందుకే సోషల్ మీడియాకు గుడ్ బై చెపుతున్నానని తెలిపింది. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని చెప్పింది.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటూ మీరు ప్రేమించిన వ్యక్తులను జాగ్రత్తగా చూసుకోవాలని చార్మి కోరింది. అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆకాంక్షించింది.

చెన్నై హ్యాట్రిక్ విజయం..

నేటి పంచాంగం, గురువారం (22-04-2021)

రా ఏజెంట్ గా కాజల్ అగర్వాల్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -