- Advertisement -
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. యాత్ర అనే టైటిల్ తో రాబోతోన్న ఆ సినిమాలో మమ్ముంటి వైఎస్ పాత్రలో కనిపించబోతున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమా గురించి హడావుడి ఎక్కువగా ఉంటుంది. నటీనటుల ఎంపిక పూర్తి అయినట్లు సమాచారం.అయితే ఈ బయోపిక్ లో వైఎస్.విజయమ్మ పాత్ర గురించి మొన్నటి వరకు అనేక రూమర్స్ వచ్చాయి.ముఖ్యంగా నయనతార – రాధికా ఆప్తే లాంటీ స్టార్ హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.
అయితే రీసెంట్ గా దర్శకుడు ఆ రూమర్స్ కి చెక్ పెట్టేశాడు. విజయమ్మ పాత్రకు బహుబలి భామను ఫైనల్ చేశారు. బాహుబలి సినిమాలో కన్నా నిదురించారా అనే పాటలో క్లాసికల్ డ్యాన్స్ తో అలరించిన ఆశ్రితా వేముగంటి. అనుష్కకు వదిన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.మరి ఈ పాత్ర ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.