- Advertisement -
ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత జయచిత్ర భర్త గణేశ్ (62) శుక్రవారం ఉదయం తిరుచ్చిలో గుండెపోటుతో కన్నుమూశారు. తిరుచ్చిలో గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో ఆయన భౌతికకాయాన్ని చెన్నైలోని పోయెస్ గార్డెన్లో గల స్వగృహానికి తరలించారు.
జయచిత్ర సుమారు 200కు పైగా దక్షిణాది భాషల చిత్రాల్లో నటించారు. జయచిత్ర 1970–80 ప్రాంతంలో హీరోయిన్ గా వెలుగొందారు. హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలోనే జయచిత్రకు కుంభకోణంకు చెందిన గణేశ్తో 1983లో వివాహం జరిగింది.
ఈ దంపతుల కుమారుడు అమ్రేశ్ ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్ గా రాణిస్తున్నాడు. కాగా, గణేశ్ మృతదేహాన్ని చెన్నైలోని పోయిస్ గార్డెన్ లో ఉన్న స్వగృహానికి తరలించారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగనుండగా, పలువురు సినీ ప్రముఖులు జయచిత్రకు సంతాపాన్ని తెలిపారు.