Monday, May 6, 2024
- Advertisement -

ఇలా ఐదు బుధవారాలు చేస్తే… మీ కోరికలన్నీ తీరుతాయట

- Advertisement -

కొంతమంది ఏదైనా పని మొదలు పెట్టగానే ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా అది ఆగిపోతుంటుంది. మరి కొంతమంది అలా ఆగిపోకుండా ఏదైనా పని మొదలుపెట్టే ముందు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. విఘ్నాలు తొలగి తమకు శుబాలు కలగాలని ప్రార్థిస్తారు. ఒక్కోసారి అలా వేడుకున్నా మధ్యలోనే కొన్నికొన్ని పనులకు బ్రేక్ వస్తుంటుంది.

అయితే గణపతిని ఈ క్రింది విధంగా పూజించి పనులు మొదలుపెడితే మాత్రం ఎటువంటి కష్టతర పనుల్లోనైనా విజయం సాదించవచ్చని పండితులు చెబుతున్నారు. గణపతితో పాటు లక్ష్మిదేవిని కూడా పూజిస్తే త్వరలోనే కోరికలన్నీ తీరుతాయని అంటున్నారు.

గణపతికి ఎర్ర రంగు పువ్వులంటే చాలా ఇష్టం. లక్ష్మిదేవికి గంధం, కుంకుమ, అక్షింతలు అంటే ఇష్టం. కాబట్టి లక్ష్మి గణపతిని ఈ నాలిగింటితో పూజించాలి. లక్ష్మీగణపతి అష్టోత్తరం చదివి బెల్లం నివేదగా సమర్పించాలి. ఇలా కేవలం 5 బుధవారాలు పూజిస్తే వెంటనే మీరు మొదలుపెట్టిన పనులు పూర్తవ్వడంతో పాటు మీ కోరికలు కూడా తీరుతాయని పండితులు చెబుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -