బిగ్బాస్ రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది.మరో రెండు వారల్లో బిగ్బాస్ రెండో సీజన్ ముగియనుంది.షో లో మిగిలింది ఎనిమిది మంది సభ్యులే కావడం ,మరో రెండు ఎలిమినేషన్లు ఉండటంతో ఎవరు బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చేస్తారో అని ఆసక్తి అందరిలోను నెలకొంది.గత వారం బిగ్బాస్ హౌస్ నుంచి కామన్మ్యాన్గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు,గణేష్లు ఎలిమినేట్ అయి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.నూతన్ నాయుడు ఇప్పటికే హౌస్ నుంచి రెండు సార్లు బయటికి వచ్చి మళ్లీ లోనికి వెళ్లారు.
ఇక గణేష్ కౌశల్తో ప్రవర్తించిన తీరు వల్లే బయటికి వచ్చేశాడని చాలామంది నమ్ముతున్నారు.తాజాగా గణేష్ ఓ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ… తను ఎలిమినేట్ అవడానికి గల కారణలు ప్రేక్షకులతో పంచకున్నాడు.ఓ కామన్ మ్యాన్గా బిగ్బాస్ హౌస్లో 80 రోజులకు పైగా ఉండటం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు.అసలు అన్ని రోజులు నేను బిగ్బాస్ హౌస్లో ఉంటానని ఊహించలేదు.మొదట్లో గేమ్ ఎలా ఆడాలో తెలియలేదని ,గేమ్ను అర్థం చేసుకునే లోపే ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశానని తెలిపాడు.ఇక హౌస్లో నాకు దీప్తి,గీతా మాధురిలు ఇష్టమైన కంటెస్టెంట్లు అని పెర్కొన్నాడు.ఇక కౌశల్ గురించి కూడా చెప్పుకొచ్చాడు గణేష్.కౌశల్ అన్న చాలా మంచివాడని ,కాని అతను కావలనే హౌస్లో అలా ప్రవర్తిస్తున్నాడని ,స్వార్థం ఎక్కువని చెప్పాడు గణేష్.
కౌశల్ అన్న హౌస్లో ఉన్న వారందరిని లీడ్ చేయలని చూస్తుంటాడు అని అందుకే హౌస్లో నిత్యం గొడవలు జరుగుతున్నాయని తెలిపాడు.ఇక బయట కౌశల్కు ఉన్న ఫాలోయింగ్ గురించి ముందే తెలుసునని,హౌస్ నుంచి ఎలిమినేట్ అయి మళ్లీ బిగ్బాస్లోకి ఎంట్రీ ఇచ్చిన హౌస్మెట్స్ ద్వారా బయట కౌశల్కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందని,కాని ఇంతలా కౌశల్ అన్నకు ఫాలోయింగ్ ఉంటుందని ఊహించలేదని తెలిపాడు గణేష్. నా అంచనా ప్రకారం అయితే కౌశల్ బిగ్బాస్ విన్నర్ కాడని అనుకుంటున్నానని,గీతా మాధురి,తనీష్ ఇద్దరిలో ఎవరో ఒకరు బిగ్బాస్ రెండో సీజన్ విన్నర్ అవుతారంటూ చెప్పుకొచ్చాడు.మరి గణేష్ చేసిన కామెంట్స్పై కౌశల్ ఆర్మీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.