- Advertisement -
టాలీవుడ్కు చెందిన హీరోయిన్ పెళ్లి కొన్ని వివాదల మధ్య జరిగింది.హీరోయిన్ మదలసా తెలుగులో కొన్ని సినిమాలు చేసింది.అయితే ఈమె బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి కుమారుడు మహాక్షయ్తో గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉంది.వీరి ప్రేమకు ఇరు కుటుంబాలు అంగీకారం తెలపడంతో వీరిద్దరి పెళ్లికి రంగం సిద్దం అయింది.అయితే ఈ లోపే తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. నాలుగేళ్లు సహజీవనం చేసిన మహాక్షయ్.. ఇప్పుడు మోసం చేశాడని ఇటీవల ఓ యువతి ఢిల్లీ పోలీసులకి ఫిర్యాదు చేసింది.
దీంతో వీరి పెళ్లి ఆగిపోయింది. విచారణ పేరుతో పోలీసులు మహాక్షయ్ని అరెస్ట్ చేశారు.బెయిల్పై బయటికి వచ్చిన మహాక్షయ్ మంగళవారం మధ్యాహ్నం మదలసాని వివాహం చేసుకున్నాడు.మహాక్షయ్పై వచ్చిన ఆరోపణల్లో నిజమెంతో ఇక్కడ అందరికీ తెలుసు. దేవుడు మావైపే ఉన్నాడు’ అని మదలసా మీడియాతో వెల్లడించింది.