Friday, April 26, 2024
- Advertisement -

శ్రియ అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌….

- Advertisement -

నటి శ్రియ తన అభిమానులకే కాదు, సినీ వర్గాలకు షాక్‌ మీద షాక్‌ ఇస్తున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీలో మంచి నటి, డాన్సర్‌ ఉన్నారు. అంతకుమించి లక్కున్న నటిగా పేరుపొందారు. దాదాపు దశాబ్దికి పైగా తెలుగు సినీ అభిమానులను తన అందచందాలతో అలరించిన ఢిల్లీ భామ శ్రియ ఇటీవల తన రష్యా ప్రియుడు ఆండ్రీ కోషీవ్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. చాలామంది హీరోయిన్లు వివాహమైన తర్వాత కూడా తమ కెరీర్‌ను కొనసాగిస్తూనే ఉన్నారు.

కోలీవుడ్‌లో అనతికాలంలోనే స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దృష్టిలో పడి సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తో జత కట్టే అవకాశాన్ని దక్కించుకుంది శ్రియ. అదే విధంగా తెలుగులోనూ స్టార్‌ హీరోలందరితోనూ నటించేసింది. ఈ మధ్య విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కనున్న ఓ చిత్రంలో నటించేందుకు కూడా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఆమె తన నటనా జీవితాన్ని కొనసాగిస్తుందని అభిమానులు సంతోషపడ్డారు. కానీ, ఆ ప్రాజెక్టును ఆమె వదులుకున్నట్లు తాజా సమాచారం.

దీంతో శ్రియను దక్షిణాది వెండితెరపై ఇకపై కూడా చూడవచ్చుననుకున్న అభిమానులకు ఆమె మరో షాక్‌ ఇస్తున్నట్లు తాజా సమాచారం. అవును శ్రియ నటనకు టాటా చెప్పి తన జీవిత భాగస్వామితో కలిసి రష్యాలో మకాం పెట్టడానికి సిద్ధం అవుతోందట. అందుకే వెంకటేశ్‌తో నటించడానికి అంగీకరించిన చిత్రాన్ని వదిలేసుకుందన్న ప్రచారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇదే నిజం అయితే చిరునవ్వుల చిన్నది శ్రియను ఇక తెరపై చూడలేమన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -