ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఆదిపురుష్ చిత్రం అప్ డేట్స్ కోసం ఆయన ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. ప్రముఖ దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ చేస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభమయ్యింది. కానీ షూటింగ్ స్టార్ట్ అయిన కొద్ది రోజులకే లాక్ డౌన్ రావడంతో నిలిచిపోయింది. కాగా ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ ను గతంలో హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ముంబైలో లాక్ డౌన్ కావడంతో షూటింగ్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు.
కానీ అదే సమయంలో హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ పెట్టారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు వచ్చిన తరువాత హైదరాబాద్ లో ‘ఆదిపురుష్’ రెండో షెడ్యూల్ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేసేందుకు ప్లాన్ చేశారు. అయితే ప్రస్తుతం లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో లాక్డౌన్ పూర్తయ్యాక షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
Also Read: స్టార్ హీరోలూ.. రెమ్యూనరేషన్ కాస్త తగ్గించుకోండి బాబూ..
అయితే జూన్ 15 నుంచి షూటింగ్ చేసేందుకు ముంబై లో అనుమతులు వచ్చాయి. దీంతో సైఫ్ అలీఖాన్పై కొన్ని సీన్లు తీయాలని యూనిట్ భావిస్తున్నది. ఇందుకు సైఫ్ కూడా ఓకే అనడంతో హైదరాబాద్ కంటే ముందే ముంబైలో షూటింగ్ చేయబోతున్నారు. ఆదిపురుష్ సినిమా మొత్తం గ్రాఫిక్స్లోనే తెరకెక్కించబోతున్నారు. దీంతో ముంబైలో భారీ సెట్టింగ్స్ కూడా వేయడం లేదు.. కేవలం గ్రీన్మ్యాట్లో షూట్ చేసి ఆ తర్వాత గ్రాఫిక్స్లో సెట్ చేయనున్నారు. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడం లేదు. ప్రభాస్ లేకుండానే ఈ షూటింగ్ జరగనున్నది. ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్లో ప్రభాస్ కలవనున్నాడు.
Also Read: మెగాస్టార్ వర్సెస్ రెబల్ స్టార్..!