- దిల్ రాజుతో నితిన్ చిత్రం ప్రారంభం
- శ్రీనివాస కల్యాణంగా పేరు ఖరారు
దాదాపు 14 ఏళ్ల తర్వాత వారిద్దరూ కలిశారు. ఇద్దరికి ఆ చిత్రం అపూర్వ విజయం సాధించింది. యువ నటుడు నితిన్ దిల్ సినిమాను నిర్మాత రాజు నిర్మించాడు. అయితే అప్పటి నుంచి రాజు పేరు ముందు దిల్ చేరి దిల్ రాజుగా అందరికీ సుపరిచితమయ్యాడు. దిల్ రాజు అంటేనే ఎవరన్నా గుర్తు పట్టే స్థాయికి వెళ్లారు. ఇక నితిన్కు ఆ సినిమా మంచి విజయం అందించింది.
వారిద్దరూ కలిసి 14 ఏళ్ల తర్వాత ఓ సినిమాకు కలిసి పనిచేస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నితిన్ ఈ సినిమాను తీయనున్నారు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస కల్యాణం’ అనే పేరును కూడా ఖరారు చేసినట్లు నితిన్ తన ట్విట్టర్లో ప్రకటించారు. నా తర్వాతి సినిమా ‘శ్రీనివాస కల్యాణం’ ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. నేను 14 ఏళ్ల కిందట కలిసి పనిచేసిన దిల్ రాజుతో ఈ సినిమా చేస్తున్నా. అని నితిన్ సంతోషం వ్యక్తం చేశాడు. శతమానం భవతితో మంచి విజయం అందుకున్న సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు చేయడం చాలా ఆనందంగా ఉంది. మార్చి నుంచి షూటింగ్ ప్రారంభమవుతుంది’ అని నితిన్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా తనతో పాటు దర్శకుడు, నిర్మాత, సంగీత దర్శకుడు ఉన్న ఫొటోలను పోస్ట్ చేశారు.
‘శతమానం భవతి’తో కలిసి పనిచేసిన సతీశ్ వేగ్నేశ, దిల్రాజు మళ్లీ కలిశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం నితిన్ ‘లై’ పరాజయం తర్వాత పవన్కల్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న సినిమాలో నటిస్తున్నాడు. దర్శకుడు కృష్ణ చైతన్య సినిమాను తీస్తున్నారు.
https://www.youtube.com/watch?v=9ole5dIsp6Y