Friday, April 19, 2024
- Advertisement -

ఎవరూ ఊహించని రేంజ్​లో గని డిజిటల్​ మార్కెట్​

- Advertisement -

గద్దలకొండ గణేశ్​తో మాస్​ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్​తేజ్​ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం గని చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో, సస్పెన్స్​ థ్రిల్లర్​గా రూపొందుతున్నట్టు టాక్​. అల్లు బాబీ, సిద్దు మద్దా సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్​తేజ్​ సినిమాను మొదటిసారి పాన్​ ఇండియా లెవెల్​లో విడుదల చేయాలని మేకర్స్​ భావిస్తున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో తమిళ హీరో ఉపేంద్ర, బాలీవుడ్​ స్టార్​ సునీల్​ శెట్టి కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీ ద్వారా కిరణ్​ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్​ భామ సాయి మంజ్రేకర్​ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది.

Also Read: రామ్​ కు తమిళ నిర్మాత వార్నింగ్​..!

ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమింటే గని చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాక్​. దాదాపు రూ. 24 కోట్లకు ఈ మూవీ డిజిటల్​ హక్కులు అమ్ముడు పోయాయట. ఇక బాక్సాఫీస్​ వద్ద ఎంత కలెక్షన్​ చేస్తుందో వేచి చూడాలి.

మొత్తానికి ఇటీవల మన తెలుగులోని ద్వితీయ శ్రేణి హీరోల సినిమాలు కూడా భారీ మార్కెట్​ను సృష్టిస్తున్నాయి. విజయ్​దేవరకొండ నటించిన లైగర్​ దాదాపు రూ. 200 కోట్లకు ఓ ఓటీటీ మార్కెట్​ చేసినట్టు టాక్​. అయితే గని నిర్మాత అల్లు బాబీ.. ఆహా ఓటీటీ సంస్థ ఆయన కుటుంబసభ్యులదే కావడం గమనార్హం.

Also Read: దీపావళి కి బిగ్​ఫైట్: రజనీకాంత్​ వర్సెస్​ అజిత్​..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -