గద్దలకొండ గణేశ్తో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వరుణ్తేజ్ విభిన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం గని చిత్రంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా క్రీడా నేపథ్యంలో, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందుతున్నట్టు టాక్. అల్లు బాబీ, సిద్దు మద్దా సంయుక్త నిర్మాణంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. వరుణ్తేజ్ సినిమాను మొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో తమిళ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషించబోతున్నారు. ఈ మూవీ ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నది.
Also Read: రామ్ కు తమిళ నిర్మాత వార్నింగ్..!
ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేమింటే గని చిత్రాన్ని ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా భారీ ధరకు కొనుగోలు చేసినట్టు టాక్. దాదాపు రూ. 24 కోట్లకు ఈ మూవీ డిజిటల్ హక్కులు అమ్ముడు పోయాయట. ఇక బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్షన్ చేస్తుందో వేచి చూడాలి.
మొత్తానికి ఇటీవల మన తెలుగులోని ద్వితీయ శ్రేణి హీరోల సినిమాలు కూడా భారీ మార్కెట్ను సృష్టిస్తున్నాయి. విజయ్దేవరకొండ నటించిన లైగర్ దాదాపు రూ. 200 కోట్లకు ఓ ఓటీటీ మార్కెట్ చేసినట్టు టాక్. అయితే గని నిర్మాత అల్లు బాబీ.. ఆహా ఓటీటీ సంస్థ ఆయన కుటుంబసభ్యులదే కావడం గమనార్హం.
Also Read: దీపావళి కి బిగ్ఫైట్: రజనీకాంత్ వర్సెస్ అజిత్..