తండ్రి వారసత్వంతో తెలుగు సినీ పరిశ్రమకు వచ్చిన నటుడు ఆది. తండ్రికి ఎలాంటి చెడ్డపేరు తీసుకురాకుండా తన పరిధి మేరకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న ఆది హిట్లు, ఫట్లు పొందాడు. సినిమా సినిమాకు నటనలో మార్పు చేసుకుంటూ పరిశ్రమలో ఉన్నాడు. అయితే రెండేళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఆది కనిపించలేదు. వివాహమైన తర్వాత సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఓ మంచి సినిమాతో ఆది రాబోతున్నాడు.
వినాయకుడు, విలేజ్లో వినాయకుడు, కేరింత సినిమాలు తీసిన దర్శకుడు అడివి సాయికిరణ్ దర్శకత్వంలో ఆది సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ముహూర్తం కూడా కుదిరిందని సమాచారం. అయితే ఈ సినిమాలో సాష చెట్రీ నటిస్తోంది. ఈ హీరోయిన్ ఎవరో అనుకుంటున్నారా? ఎయిర్టెల్ వాణిజ్య ప్రకటనల్లో కనిపించే అమ్మాయే సాష చెట్రీ. యాడ్స్తో అందర్నీ ఆకట్టుకుంటున్న సాష టాలీవుడ్తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతోంది. దీంతో ఈ సినిమా ఆసక్తికరంగా మారింది.