Tuesday, April 30, 2024
- Advertisement -

ఐశ్వర్యారాయ్ ఆసుపత్రికి తరలింపు.. ఏమైంది ?

- Advertisement -

మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కోవిడ్ 19 రావడంతో ముంబై నానావతి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత బచ్చన్ కోడలు మనవరాలికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అభిమానుల్లో ఆందోళన చెందారు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ .. తన కుమార్తె ఆరాధ్య కూడా ఎటువంటి లక్షణాలు లేకుండా పాజిటివ్ అని తేలింది.

అయితే ఆ రిపోర్ట్ వచ్చిన అనంతరం ఈ శుక్రవారం నుంచి వీరిద్దరూ జ్వరం గొంతు నొప్పితో బాధపడుతున్నారని తెలుస్తోంది. దాంతో వారు కూడా ఆసుపత్రిలో చేరారు. ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఐశ్వర్య రాయ్ కు ఇప్పటికే తీవ్ర జ్వరం వచ్చింది. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారని.. ఆరాధ్యకు తేలికపాటి జ్వరం వచ్చిందని తెలుస్తోంది. ఇప్పటికి బచ్చన్ లు ఇరువురితో పాటు ఆ ఇద్దరి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. చికిత్స పొందిన తరువాత.. ఐశ్వర్య జ్వరం తగ్గింది.

ఆమె గొంతు ఇన్ఫెక్షన్ కూడా తగ్గుముఖం పట్టింది. పరిస్థితి స్థిరంగా ఉంది. మరోవైపు ఆరాధ్య జ్వరం దాదాపుగా తగ్గిపోయింది. అమితాబ్- అభిషేక్- ఐశ్వర్య – ఆరాధ్య టోటల్ ఫ్యామిలీ ముంబై నానవతి హాస్పిటల్ లో ఒకే వీఐపీ విభాగంలో ఉంచారు. ఆరాధ్య మరియు ఐశ్వర్యలను ప్రస్తుతం డాక్టర్ బార్వే .. డాక్టర్ అన్సారీ వంటి ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో వివిక్త వార్డులో ఉంచారు. బచ్చన్ ఫ్యామిలీ వేగంగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు పూజలు పునస్కారాలు చేస్తున్న విషయం తెలిసిందే.

పొట్టతగ్గడం కోసం అనసూయ యోగా.. తిడుతున్న నెటిజన్లు..!

మొక్కలు నాటిన దర్శకుడు సంపత్ నంది..!

పవన్ కి విష్ చేసిన అలీ.. ఫైర్ అవుతున్న పవన్ ఫ్యాన్స్..!

ఆమెకు యాటిట్యూడ్, పొగరు.. రష్మీ పై సుధీర్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -