Sunday, April 28, 2024
- Advertisement -

మొక్కలు నాటిన దర్శకుడు సంపత్ నంది..!

- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడవ విడతలో భాగంగా ప్రముఖ యాంకర్ ఉదయ భాను.. దర్శకుడు సంపంత్ నదికి ఛాలెంజ్ విసిరింది. ఆ ఛాలెంజ్ యాక్సెఫ్ట్ చేసిన సంపత్ నంది.. తన కుటుంబ సభ్యులతో కలిసి చిలుకూరు లోని తన వ్యవసాయ క్షేత్రం లో మొక్కలు నాటాడు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత కాబట్టి బాధ్యతగా అందరం మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి అని తెలియజేశారు. పద్మశ్రీ వనజీవి రామయ్య కోటి మొక్కలు నాటాడు అని తెలిపినప్పుడు సంతోషించాను అని.. అలానే మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీత కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిమ్మప్ప జాతీయ రహదారుల వెంట మొక్కలు నాటారు. కానీ మన సంతోష్ అన్న ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు అని తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఉందని మన సంతోష్ అన్నకు వారికి మించిన గౌరవం దక్కాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

ఇప్పటికే కరోనా కారణంగా మన మూతులకు మాస్కులు పెట్టుకోవాల్సి వచ్చిందని.. భవిష్యత్తులో మన వీపులకు ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం అందరం మొక్కలు నాటాలని తెలిపారు. ఇంత మంచి కార్య క్రమం చేపట్టి ముందుకు తీసుకెళ్తున్న రాజ్య సభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ హీరోయిన్స్ భూమిక చావ్లా, ఊర్వశి రాహుటేలా, దిగాంగనాసూర్యవంశీ లక్ను ఈ చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని అన్నారు.

పొట్ట తగ్గట్లేదు అంటూ అద్దంని తిడుతున్న విష్ణు ప్రియా..!

‘దృశ్యం’లో నటించిన ఈ పాప.. హీరోయిన్ అయింది..!

ప్రముఖ నటి, ఎంపీ సుమలతకు కరోనా పాజిటివ్..!

స్నానం చేస్తుండగా వీడియో.. అత్యాచారం : సింగర్ చిన్మయి ఫైర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -