అవినీతి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అన్ని భాషల్లో అవినీతి, నల్లధనం నేపథ్యంలో వందల చిత్రాలు వచ్చి ఉంటాయి. అయినా వాటిలో ఇంకా సినిమాలు తీసే శక్తి ఉంది. ఈ నేపథ్యంలో మరో అవినీతి నిర్మూలన నేపథ్యంలో బాలీవుడ్లో ఓ సినిమా వస్తోంది. అజయ్ దేవగణ్ నటిస్తున్న సినిమా ‘రెయిడ్’. రాజ్కుమార్ గుప్తా దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల చేశారు. ‘హీరోలు ఎల్లప్పుడూ యూనిఫాంలలో రారు’ అని రెయిడ్ క్యాప్షన్ ఉంది.
ఓ యదార్థ ఘటనతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. 1980లో ఉత్తర్ప్రదేశ్లో ఐటీ దాడుల నేపథ్యంలో ఈ సినిమా ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. లక్నో ఐటీ ఉప కమిషనర్ అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ నటిస్తుండగా ఇలియానా హీరోయిన్గా చేస్తోంది. ‘బాద్షాహో’ తరువాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న రెండో సినిమా. టీ-సిరీస్, పనోరమా స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మార్చి 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్లో.. ‘నా ఇంట్లో ఏ ప్రభుత్వాధికారి దోమలను కూడా పట్టుకోలేడు. అలాంటిది నువ్వు రెయిడింగ్ చేస్తావా?అయినా నువ్వు ఇక్కడ ఏమీ పట్టుకోలేవు. ఖాళీ చేతులతో వెళ్తావు’ అని ఓ వ్యక్తి అజయ్కు వార్నింగ్ ఇస్తాడు. ‘ఈ దేశంలో పేదరికం వల్ల ప్రజలు పేదలుగా మారడం లేదు. నీలా దేశం మీద పడి దోచేస్తున్న ధనికుల వల్ల ప్రజలు పేదలుగా మారుతున్నారు.’ వంటి డైలాగ్ సూపర్గా ఉన్నాయి.
‘పెళ్లయ్యాక అత్తగారింటి నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఖాళీ చేతులతో వచ్చాను. కానీ ఇప్పుడు నేను ఎవరింటికైతే వచ్చానో ఆ ఇంటికి ఏదో ఒకటి(సంకెళ్లు) తీసుకురాకుండా ఉండను’ అని మరో డైలాగ్ ఆకట్టుకుంటోంది.