Saturday, May 11, 2024
- Advertisement -

అఖిల్ మూడో సినిమా స‌త్య పినిశెట్టితో ప‌క్కా!

- Advertisement -

అక్కినేని నాగార్జున రెండో వారసుడు హ‌లో సినిమాతో సాధార‌ణ విజ‌యం అందుకున్నాడు. ఎంత హైప్ క్రియేట్ చేసినా సోసో సినిమా ఆడింది. ఇక అఖిల్ సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగ‌వ‌చ్చ‌ని నిర్ధార‌ణ చేసుకున్నాడు. త‌న మూడో సినిమాపై బాగా దృష్టి పెట్టాడు. అఖిల్ వరకు ట్రాక్ ఎక్కేసినట్టే అనిపిస్తుంది. విక్రం ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ తండ్రి నాగార్జున నిర్మాణంలో వ‌చ్చాడు. ఆ సినిమా త‌ర్వాత మ‌రో సినిమా చేయ‌నున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత మరేమాత్రం గ్యాప్ లేకుండా తన తర్వాత సినిమా ప్రకటించేస్తున్నాడు అఖిల్. అఖిల్ మూడో సినిమాను జనవరి 10వ తేదీన చేస్తాన‌న్నాడు.

వంశీ పైడిపల్లి, కొరటాల శివ, సుకుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌య‌త్నం చేసి చివరకు ఆది పినిశెట్టి సోద‌రుడు స‌త్య పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించేందుకు ప‌క్కాగా డిసైడ‌య్యారంట‌. సత్య ఇది వరకు త‌న అన్న ఆదితో క‌లిసి మలుపు సినిమా తీసి హిట్ అందుకున్నాడు. రీసెంట్‌గా అఖిల్‌ను కలిసి కథ వినిపించాడట సత్య. ఈ ప్రాజెక్టును రానా దగ్గుబాటి తన సంస్థ క్వాన్ ద్వారా నిర్మించనుండటం విశేషం. ఇకపోతే తాజా సమాచారం మేరకు నటుడు ఆది పినిశెట్టి సోదరుడు, ‘మలుపు’ చిత్ర సత్య ప్రభాస్ పినిశెట్టి అఖిల్ కు కథ వినిపిస్తున్నారని తెలుస్తోంది. మరి అఖిల్ తన నెక్స్ట్ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఆయనకే ఇస్తారేమో చూడాలి.

అయితే అఖిల్‌కు స్నేహితుడు, వ‌రుస‌కు బంధువు అయ్యే ద‌గ్గుబాటి రానా ఈ సినిమాను నిర్మిస్తాడ‌ని టాక్ వినిపిస్తోంది. అఖిల్ మొదటి సినిమా నితిన్ చేయగా.. రెండో సినిమా నాగార్జున స్వయంగా నిర్మించాడు. ఇప్పుడు మూడో సినిమా రానా నిర్మాణంలో వస్తోందని స‌మాచారం. రానా క్వాన్ సంస్థ నిర్మాణంలో ఈ సినిమా వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -