Saturday, May 11, 2024
- Advertisement -

అఖిల్ కు కోపం వచ్చింది!

- Advertisement -

అక్కినేని మూడో తరం హీరో అక్కినేని అఖిల్ తన మొదటి సినిమా అఖిల్ తో అభిమానులను అలరించడంలో విఫలం అయ్యాడు. భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ చిత్రం ప్లాప్ గా నిలిచి అభిమానులని నిరాశ పరిచింది. ఆ సినిమా తర్వాత అఖిల్ ఎవరు దర్శకత్వంలో చేస్తాడు అని అందరు ఎదురు చూసారు.

ఈ మధ్య చాలమంది దర్శకుల పేర్లు వినిపించిన ఏ దర్శకుడు ఇంక పైనల్ కాలేదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అఖిల్ కు ఇప్పుడు ఎక్కడ లేని కోపం వచ్చింది అంతే ట్విట్టర్ కెక్కాడు. అఖిల్ కు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా…. వంశీ పైడిపల్లి అఖిల్ సినిమా నుండి తప్పుకున్నాడని వార్తలు రావడంతో అది బాగా స్ప్రెడ్ కావడంతో కోపం కట్టలు తెంచుకుంది.

అందుకే ట్విట్టర్ కెక్కాడు. వంశీ పైడిపల్లి తో సినిమా ఆగిపోలేదని ,ఇంకా చర్చల దశలో ఉందని త్వరలోనే పూర్తి అధికారికంగా అన్ని విషయాలు వెల్లడిస్తానని, తప్పుడు వార్తలు సృస్టించకుండా మా పీఆర్ టీం ని కలిసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చని ట్వీట్ చేసాడు అఖిల్. దీనిపై ఇంతగా వార్తలు రావడానికి కారణం ఏంటంటే ఊపిరి రిలీజ్ అయి 50రోజులు కావస్తున్నప్పటికీ అఖిల్ సినిమా ఇంకా ప్రకటించకపోవడంతో రకరకాల కథనాలు వస్తున్నాయి. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -