Sunday, April 28, 2024
- Advertisement -

ఫ్లాప్ దర్శకుడితో సినిమా తీయబోతున్న మెగా నిర్మాత

- Advertisement -

ఇంతకు ముందు వరకు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే బోయపాటి శ్రీను ‘వినయ విధేయ రామ’ సినిమా చేయకముందు వరకు చేతిలో స్టార్ హీరోల డేట్లు కూడా ఉండేవి. మెగాస్టార్ చిరంజీవి కూడా బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. బాలకృష్ణ కూడా ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొక పవర్ఫుల్ సినిమా చేస్తానని మాట కూడా ఇచ్చారు. కొంతకాలం పాటు అఖిల్ కూడా బోయపాటి శ్రీను తో చేతులు కలపబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఏ ముహూర్తాన ‘వినయ విధేయ రామ’ సినిమా విడుదలైందో కానీ ఆ సినిమా డిజాస్టర్ కావడంతో బోయపాటి శ్రీను కి కొత్త అవకాశాలు రాకపోవడం సరికదా ఉన్న అవకాశాలు కూడా పోయాయి.

చిరంజీవి బోయపాటి తో సినిమా గురించి మర్చి పోయి సైరా సినిమాతో బిజీ అయిపోయారు. బాలయ్య కూడా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక అఖిల్ కూడా బోయపాటి తో సినిమా చేయడం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ప్రముఖ నిర్మాత బోయపాటి శ్రీను తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అతను ఎవరో కాదు మెగా నిర్మాత అల్లు అరవింద్. తాజాగా ‘గుణ 369’ సినిమా వేడుకలో మాట్లాడుతూ గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థ బోయపాటి శ్రీను సినిమా ఒకటి నిర్మించనుందని చెప్పారు. హీరో ఎవరు? కథ ఏంటి? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వకపోయినప్పటికీ బోయపాటి శ్రీనుతో సినిమా తీయబోతున్నట్లు మాత్రం క్లారిటీ ఇచ్చారు అల్లు అరవింద్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -