- Advertisement -
హీరో అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయింది.దీంతో తన తరువాత సినిమాపై మరింతగా ఫోకస్ పెట్టాడు.విభిన్న కథల దర్శకుడు విక్రమ్ కూమార్తో తన తదుపరి సినిమా చేస్తున్నాడు బన్నీ.విక్రమ్ గతంలో ఇష్క్,మనం, 24,హలో ,వంటి సినిమాలను రూపొందించాడు.
బన్నీ కోసం కూడా ఓ ప్రయోగాత్మక కథ రాసుకుంటాడనుకుంటే ఈసారి మాస్ ఎంటర్టైనర్ కథతో సినిమా చేయబోతున్నాడు.బన్నీ ఈ సినిమాలో బన్నీ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడని సమాచారం. విక్రమ్ మాస్ ఎంటర్టైనర్ చేయడం పైగా బన్నీ డ్యూయల్ రోల్ కావడంతో సినిమాపై అంచనాలు పెరుగిపోతున్నాయి. నల్లమలుపు బుజ్జి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.ఇంకా ఈ సినిమాపై ఎటువంటి ప్రకటన రాలేదు.