స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని మే 4న విడుదలకు రెడీ అయ్యాడు.ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తున్నాడు.తీవ్ర కోపంతో ఉండే క్యారెక్టర్ చేస్తున్నాడు బన్నీ.లగడపాటి శ్రీధర్, నాగబాబు సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా మే 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్ర యూనిట్.తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను అమెరికన్ టీవీ ఛానల్ హెచ్బీఓలో ప్రారంభించారు చిత్రయూనిట్.
హాలీవుడ్ ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలో కనిపించిన బన్నీ కార్యక్రమానికి సంబంధించిన వివరాలతో పాటు మే 4న రిలీజ్ అవుతున్న నా పేరు సూర్య చూడాలంటూ కోరారు. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచియమవుతున్నా డు.ఈ సినిమాలో అను ఇమ్మాన్యూల్ హీరోయిన్గా నటిస్తుండగా అర్జున్, శరత్ కుమార్లు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.ఇప్పటికే రీలిజ్ అయిన టీజర్,ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది.