Sunday, May 5, 2024
- Advertisement -

కొత్త ద‌ర్శ‌కుడితో బ‌న్నీ కొత్త‌కొత్త‌గా

- Advertisement -

ఈ న‌డి మ‌ధ్య కొత్త ద‌ర్శ‌కులే సూప‌ర్ సినిమాలు తీస్తున్నారు. కొత్త క‌థ‌ల‌తో సినీన‌టుల‌ను తెర‌పైకి తీసుకొస్తూ సినీ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి హిట్లు కొడుతున్నారు. అదే కోవ‌లో బ‌న్నీ కూడా వ‌చ్చేలా క‌నిపిస్తున్నాడు. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నాడు. చూస్తున్నాడేంటి.. ఇచ్చేశాడు. బ‌న్నీ కొత్త అడుగులు వేస్తున్నాడు. ఇన్నాళ్లు త‌ను ఫాలో అయిన మార్గాన్ని మార్చుకొని కొత్త మార్గంలో వెళ్తున్నాడు.

అల్లుఅర్జున్ సినిమాలంటే యావ‌రేజ్ అనే న‌మ్మ‌కం ఉంటుంది. ఆ విధంగానే బ‌న్నీ సినిమాలు ఆడాయి. ఇప్పుడు కొత్త ద‌ర్శ‌కులకు అవ‌కాశం ఇవ్వాల‌ని చూస్తున్నాడు. కొత్త ద‌ర్శ‌కుడు సుకుమార్‌తో మాత్ర‌మే ఆర్య సినిమా చేశాడు. ఆ త‌ర్వాత కొత్త ద‌ర్శ‌కుడితో చేయ‌లేదు. ఇన్నేళ్ల త‌ర్వాత వ‌క్కంతం వంశీని న‌మ్మి నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ల‌గ‌డ‌పాటి శ్రీ‌ధ‌ర్, నాగ‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ‌ర‌త్ కుమార్ విల‌న్‌గా, యాక్ష‌న్ కింగ్ అర్జున్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. అను ఎమ్మాన్యువ‌ల్ హీరోయిన్‌గా చేస్తోంది.

ఈ స‌మ‌యంలోనే ఓ ద‌ర్శ‌కుడి క‌థ‌కు ఓకే చెప్పాడ‌ని టాక్‌. నా పేరు సూర్య సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం గోవాలో జ‌రుగుతోంది. ఈ మ‌ధ్య విన్నక‌థ న‌చ్చేసింద‌ట‌. సంతోశ్‌రెడ్డి అనే ద‌ర్శ‌కుడు నా పేరు సూర్య సెట్‌లోనే బ‌న్నీకి చెప్పాడంట‌. ఈ క‌థ విన్న బ‌న్నీకి న‌చ్చేసింద‌ట‌. ఈ సినిమాను చేద్దామ‌ని క‌మిట్‌మెంట్ ఇచ్చేశాడ‌ని స‌మాచారం. క‌థ‌ను ఇంకొంచెం డెవ‌ల‌ప్ చేసి తీసుకురావాల‌ని సూచించాడ‌ట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -