Saturday, May 4, 2024
- Advertisement -

నా పేరు సూర్య ఐదు షోలకు తెలుగు రాష్ట్రాల అనుమతి

- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన నా పేరు సూర్య చిత్రం మే 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలౌతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికున్న క్రేజ్ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐదవ షో వేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఈనెల 4వ తేదీ నుంచి ఐదు షోలు వేసుకునేందుకు అనుమతి ఇవ్వడడంతో చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ… మా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన నా పేరు సూర్య చిత్రానికి ఎంతటి క్రేజ్ నెలకొందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్ర ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ అయిన తర్వాత ఆ క్రేజ్ డబుల్ అయ్యింది. మే 4న రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి ఐదవ ఆటను కూడా ప్రదర్శించుకునేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అనుమతినివ్వడం చాలా సంతోషంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషిలో భాగం ఇది. వేసవి సెలవులు కావడం… ఈ సినిమాకు విపరీతమైన డిమాండ్ ఉండడంతో ఐదవ ఆటకు అనుమతి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఈ సందర్భంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు మా చిత్ర యూనిట్ తరపును కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -