Tuesday, April 30, 2024
- Advertisement -

ఖరీదైన డూప్లెక్స్ను కొన్న అమితాబచ్చన్.. ఎక్కడో తెలుసా?

- Advertisement -

భారతీయ చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన గొప్ప నటుల్లో ఒకరు అమితాబచ్చన్. నటుడిగానే కాకుండా బుల్లితెరపై కౌన్ బనేగా కరోడ్ పతి తో దేశ వ్యాప్తంగా ఎంతో గొప్ప పాపులారిటీ సంపాదించారు. అనేక యాడ్స్ లో నటిస్తున్నారు. ఈ మద్య తెలుగు లో కూడా నటిస్తున్నారు. మనం, సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు. మహారాష్ట్రలో ఆయనకు అనేక చోట్ల సొంత భవనాలు ఉన్నాయి.

తాజాగా అమితాబచ్చన్ ముంబైలో ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. 5,184 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఇంటిని రూ. 31 కోట్లతో ఆయన కొన్నారు. ఈ ఇంటికి ఆరు కార్ పార్కింగ్ లు ఉన్నాయి. గత డిసెంబర్ లో ఈ ఇంటిని కొన్నప్పటికీ… ఈ నెలలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఈ హౌస్ నిమిత్తం అమితాబ్ రూ. 62 లక్షలు స్టాంప్ డ్యూటీ చెల్లించారట. ఈ డూప్లెక్స్ హౌస్ లను ప్రముఖ బిల్డర్ సంస్థ క్రిస్టల్ గ్రూప్ నిర్మించింది.

ప్రస్తుతం ముంబైలోని జుహు ఏరియాలో ఉన్న ఇంటిలో అమితాబ్ నివసిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పుడుంటే ఇంటిని కూడా ఆయన ఓ ఫిల్మ్ మేకర్ నుంచి కొనుగోలు చేసి.. మళ్లీ అన్ని సౌకర్యాలతో పునర్నిర్మించారు. బహుళ అంతస్తుల ఈ భవనంలో అమితాబ్ కొన్న డూప్లెక్స్ 27, 28 ఫ్లోర్లలో ఉంది. ఇదే బిల్డింగ్ లో బాలీవుడ్ శృంగార నటి సన్నీ లియోన్ కూడా ఇంటిని కొనుగోలు చేసింది.

వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పూనమ్ కౌర్.. కారణం అదేనా?

మంత్రి కేటీఆర్ కి ట్విట్టర్ లో వింత అనుభవం!

కృష్ణపట్నంలో రాత్రి హై డ్రామా.. ఆనందయ్యను రహస్య ప్రదేశానికి తరలించిన పోలీసులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -