Tuesday, April 30, 2024
- Advertisement -

వారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పూనమ్ కౌర్.. కారణం అదేనా?

- Advertisement -

నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించిన పూనమ్ కౌర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్, మీటు ఉద్యమ సమయంలో కత్తి మహేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ద్వారా పూనమ్ వెలుగులోకి వచ్చారు.

పూనమ్ సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద ట్వీట్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.ఈమె చేసే ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేస్తుందో అర్థం కాక నెటిజన్లు తలలు పీకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతుంటాయి. ఎప్పుడూ ఏదో ఒక వార్త ద్వారా వార్తల్లో నిలిచే పూనమ్ తాజాగా కొన్ని టీవీ చానల్స్ పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజుల నుంచి బిగ్ బాస్ సీజన్ ప్రారంభమయ్యే సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులను కలిశారని,కానీ వారు బిగ్ బాస్ రియాలిటీ షో కు ఆమెను తీసుకోవడానికి ఇష్టంగా లేరనే వార్తలు చక్కర్లు కొట్టాయి.

Also read:ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది: రష్మిక

తాజాగా ప్రముఖ టీవీ ఛానల్ తనకోసం తన ఫ్రెండ్స్, తన ఫ్యామిలీకి ఫోన్లో చేస్తున్నారని, అలాంటి ప్రయత్నాలు మానుకోవాలని, తనకు బుల్లితెరపై కనిపించే ఇంట్రెస్ట్ ఏమాత్రం లేదని బుల్లితెర నిర్వాహకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కి సంబంధించి తనపై వస్తున్న వార్తలను కూడా ఖండించారు. బిగ్ బాస్ నిర్వాహకులే తనను కలిశారని, బిగ్ బాస్ లో నటించడం తనకు ఇష్టం లేదనే విషయాన్ని తెలియజేశారు. చూడాలి మరి ఈమె వార్నింగ్ ద్వారా అయినా టీవీ చానల్స్ సైలెంట్ అవుతాయో లేక మళ్లీ మొదలుపెడతాయో వేచిచూడాలి.

Also read:పెళ్లి తర్వాత కాజల్ దూకుడు మాములుగా లేదు.. హాట్ ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న కాజల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -