Friday, March 29, 2024
- Advertisement -

దివితో క్లోజ్ ఉంటే అదేనా : అమ్మా రాజశేఖర్ భార్య ఫైర్

- Advertisement -

బాస్ హౌస్ నుండి గత వారం దివి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇందుకు పలు కారణాలు ఉన్నప్పటికి.. అమ్మా రాజశేఖర్ కూడా ఒక కారణమని అంటున్నారు. మాస్టర్ తో తనకున్న బాండింగ్ దివిపై ఎఫెక్ట్ చూపించిందని చెబుతున్నారు. హౌస్ లో మొదట చాలా జెన్యూన్ గా ఉన్న రాజశేఖర్ ఆ తర్వాత సెల్పిష్ గా మారిపోయాడు.

అలాంటి అమ్మా రాజశేఖర్ తో దివి బాండింగ్ పెట్టుకోవడం.. ఇద్దరు కలిసి గేమ్ ఆడటం చాలా మందికి నచ్చలేదు. అమ్మా రాజశేఖర్ గుండు కొట్టించుకున్న ఎపిసోడ్ లో దివి తెగ ఏడ్చింది. ఏది ఏమైన దివి ఎలిమినేషన్ కు అమ్మా రాజశేఖర్ ఒక కారణం అని చెప్పవచ్చు. అయితే వీరిద్దరి బాండింగ్ పై రకరల పుకార్లు వస్తున్నాయి. దీంతో అమ్మా రాజశేఖర్ భార్య రాధ ఫైర్ అయ్యారు. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దివి, రాజశేఖర్ ఒకరికొకరు సపోర్టర్లుగా మాత్రమే ఉన్నారని.. వాళ్లది జెన్యూన్ బాండింగ్ అని అన్నారు. తన భర్తకి లవ్ ట్రాక్ లు ఉన్నాయంటే అది కామెడీనే అని.. తనకైతే అలాంటివి ఉన్నాయని అనిపించడంలేదని.. మేల్, ఫిమేల్ క్లోజ్ గా ఉంటే లవ్ వచ్చేస్తుందా..? అంటూ ప్రశ్నించారు.

మొదట్లో కరాటే కళ్యాణితో తన భర్త రొమాంటిక్ గా చేశారని. అది కామెడీగానే అనిపించిందని.. వాళ్లిద్దరి మధ్య ఏదో ఉందని అనుకునేవాళ్ళకి ఏ యాంగిల్ లో అలా అనిపించిందో తనకు తెలియదని అన్నారు. దివి విషయంలో కూడా అంతేనని.. వాళ్ళేం సీక్రెట్ గా మాట్లాడుకోలేదని అన్నారు. ఇప్పటివరకు ఆయన చాలా మంది అమ్మాయిలతో పని చేశారని.. కానీ ఎప్పుడు ఎలాంటి డిస్టబెన్స్ జరగలేదని చెప్పింది.

నోయెల్ ని ట్రోల్ చేసిన వారికి కౌంటర్ ఇచ్చిన రాహుల్..!

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తున్న ‘రామరాజు ఫర్‌ భీమ్‌’

‘ఆర్.ఆర్.ఆర్’ నుంచి ఎన్టీఆర్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే ?

బ్రహ్మాజీ పిల్లలను ఎందుకు వద్దనుకున్నాడో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -