Saturday, May 4, 2024
- Advertisement -

డబ్బులు లేకుంటే ఆ యాంకర్ నా పెళ్లి చేసింది : పూరి జగన్నాథ్

- Advertisement -

పూరి జగన్నాథ్ కి టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. ఆయన ఏ సినిమా చేసి ఆ సినిమాకు విపరితమైన క్రేజ్ ఉంటుంది. బద్రి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన పూరి.. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తర్వాత చాలా మంది హీరోలకు బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చి వారిని స్టార్ హీరోలను చేశాడు.

అందుకే మధ్యలో కొన్ని ప్లాపులు వచ్చిన పూరి క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఇటీవలే పూరి మళ్లీ సూపర్ హిట్ అందుకున్నాడు. ’ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో మళ్లీ హిట్ కొట్టడమే కాకుండా.. హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో రామ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో ఫైటర్ అనే సినిమా చేస్తున్నాడు పూరి. తాజాగా తన పెళ్ళి నాటి విషయాల గురించి చెప్పి షాక్ కు గురిచేసాడు పూరి.

పూరి మాట్లాడుతూ..”నేను లావణ్యను పెళ్ళి చేసుకున్నప్పుడు నా దగ్గర కనీసం డబ్బులు లేవు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం తిరుగుతున్న రోజుల్లో నేను సంపాదించింది లేదు. నాది ప్రేమ వివాహం కావడంతో… సీక్రెట్ గా గుడిలో చేసుకున్నాను. అప్పుడు తాళి బొట్టు కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. ఆ టైములో యాంకర్ ఝాన్సీ.. తాళిబొట్టు కొనిపెట్టింది. ఇక హేమ కూడా పెళ్ళి బట్టలు పెట్టింది. మిగిలిన నా ఫ్రెండ్స్ కూల్ డ్రింక్స్ వంటివి స్పాన్సర్ చేసారు. నేను ఇండస్ట్రీలో పని చెయ్యడం మొదలుపెట్టాక బాగా సంపాదించాను. అయితే కొంతమంది స్నేహితులను గుడ్డిగా నమ్మి పోగొట్టుకున్నాను. అయితే నా పెళ్ళికి సాయం చేసిన ఝాన్సీ, హేమ అలాగే నా స్నేహితులను ఎప్పటికీ మర్చిపోలేను” అంటూ పూరి చెప్పుకొచ్చాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -