Tuesday, April 30, 2024
- Advertisement -

జైల్లో ప్రదీప్.. కేసు నమోదు.. హీరోగా ఎలా ?

- Advertisement -

బుల్లితెరపై ఎంత మంది యాంకర్స్ ఉన్నప్పటికి యాంకర్ ప్రదీప్ కు ఉన్న క్రేజ్ వేరు. ఆయన ఏ షో చేసిన అది సూపర్ హిటే. ఇప్పటికే చాలా షోస్ చేసిన ప్రదీప్ ప్రస్తుతం ఢీ డాన్స్ షోలో యాంకర్ గా చేస్తున్నాడు. అయితే బుల్లితెర యాంకర్స్ హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రష్మీ హీరోయిన్ గా చేసింది. అలానే అనసూయ కూడా వెండితెరపై నటిస్తోంది.

ఇక మేల్ యాంకర్స్ కూడా హీరోగా చేస్తున్నారు. ఇప్పటికే యాంకర్ రవి హీరోగా ఓ సినిమా చేశాడు. ఇప్పుడు ఇదే దారిలో యాంకర్ ప్రదీప్ కూడా హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అంటూ ఒక సినిమాను చేసిన ప్రదీప్ త్వరలోనే ప్రేక్షకుల ముదుకు రాబోతున్నాడు. ఇటీవలే ఆ చిత్రంలోని పాటను మహేష్ బాబు విడుదల చేయడంతో సినిమా గురించి జనాల్లో ఆసక్తి పెరిగింది.

ప్రస్తుతం సినిమా గురించి మీడియాలో పాజిటివ్ బజ్ ఉండగా అనూహ్యంగా ప్రదీప్ పై పోలీసు కేసు నమోదు అయ్యింది. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి ఈ కేసును పెట్టాడు. కేంద్ర సెన్సార్ రూల్స్ ప్రకారం జైలుకు వెళ్లిన వారు హీరోలుగా నటించేందుకు అనర్హులు. అందుకే ఈ చిత్రంలో ప్రదీప్ హీరోగా నటించడం చట్ట విరుద్దం అంటూ కేసు పెట్టాడు. కొన్నాళ్ల క్రితం ప్రదీప్ ఒక అమ్మాయిని వేదించిన కేసు విషయంలో రెండు రోజులు జైలుకు వెళ్లాడు.

కేసు నిరూపితం కావడంతో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. అందుకే ప్రదీప్ హీరోగా చేసేందుకు అనర్హుడు అంటూ సునిశిత్ అంటున్నాడు. బంజారాహిల్స్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. షూటింగ్ పూర్తి కాకుంటే వెంటనే ఆపేయాలంటూ సునిశిత్ తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. మరి ఈ కేసు ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -