Saturday, April 20, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప్ ఇంట విషాదం.. ఆందోళనలో అభిమానులు!

- Advertisement -

ప్రముఖ యాంక‌ర్, బుల్లితెర నటుడు ప్రదీప్ మాచిరాజు ఇంట తీవ్ర విషాదం నెలకొంది. గత కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న యాంకర్ ప్రదీప్ తండ్రి పాండురంగ మాచిరాజు (65) ఈరోజు తెల్లవారు జామున మరణించినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతోఆయన కరోనా కారణంగా మరణించారనే వార్తలు వస్తున్నప్పటికీ దానిపై అధికారిక సమాచారం లేదు. యాంకర్ ప్రదీప్ ఇంట నెలకొన్న ఈ విషాదంత ఘటనతో ఆయన అభిమానులు, చలనచిత్ర ప్రముఖులు సంతాపం తెలియజేశారు. .

యాంకర్ ప్రదీప్ ప్రముఖ టెలివిజన్ ఛానల్ లో ప్రసారమయ్యే పలు ఎంటర్టైన్మెంట్ షోలలో
తన అద్భుతమైన ప్రతిభతో విశేషమైన ప్రజాదరణ పొందాడు. ప్రదీప్ బుల్లితెర పై తనదైన రీతిలో యాంకరింగ్ చేస్తూ చురుకైన పంచులతో తెలుగులో టాప్ షోలకు వ్యాఖ్యాతగా అదరగొడుతుంటారు. జీ తెలుగులో ప్రసారమైన గడసరి అత్త సొగసరి కోడలు కార్యక్రమానికి గాను ప్రదీప్ కు టీవీ నంది పురస్కారం లభించింది.

Also read:శర్వానంద్ శ్రీకారం అక్కడ బోల్తా కొట్టినా.. ఇక్కడ మాత్రం హిట్!

యాంకర్ ప్రదీప్ వెండితెరపై 100% లవ్, జులాయి, అత్తారింటికి దారేది, రామయ్యా వస్తావయ్యా లాంటి సినిమాల్లో సహాయ పాత్రలు పోషించాడు. ప్రదీప్ ఇటీవల ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమా ద్వారా తెలుగుఇండస్ట్రీకి హీరోగా పరిచయమయ్యారు.
రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మం‍చి వసూళ్లను కాబట్టి ప్రదీప్ హీరోగా మరిన్ని అవకాశాలను పొందేలా చేస్తుంది.

Also read:మరోసారి ఆ పాత్రలో సందడి చేయనున్న ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -