డైరెక్టర్ రమేశ్ వర్మ బంఫర్ బహుమతి సొంత చేసుకున్నారు. రాక్షసుడుతో డైరెక్టర్గా మంచి హిట్ కొట్టిన ఆయన.. ప్రస్తుతం ఖిలాడి తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా ఖిలాడీ చిత్రం సిద్ధమవుతోంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే సినిమా విడుదలకు ముందే రమేశ్ వర్మ భారీ బహుమానం దక్కించుకున్నారు.
సినిమా విడుదలై.. ప్రేక్షకుల్లో మంచి టాక్ సొంతం చేసుకుని… బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ఉంటే.. ఆ చిత్ర దర్శకుడికి హీరో లేదా నిర్మాత బహుమతులిస్తుండటం సర్వసాధారణంగా చూస్తుంటాం. కానీ ఖిలాడీ సినిమా విడుదల కాకముందే .. దర్శకుడు రమేశ్ వర్మకు కోటి విలువ చేసే భారీ కానుక ఇచ్చారు ఆ సినిమా ప్రొడ్యూసర్ కొనేరు సత్యనారాయణ. కోటి 15 లక్షల విలువ చేసే రేంజ్ రోవర్ కారుని బహుమతిగా అందించారు.
ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్గా మారింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా గురించే నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. విడుదల కాకముందే నిర్మాతకు ఇంత భారీ కానుక ఇచ్చారంటే.. సినిమా సూపర్గా వచ్చి ఉంటుంది అని అభిమానులు అంటున్నారు. మరోవైపు ఫిబ్రవరి 11న ఖిలాడి ప్రేక్షకుల ముందుకు రానుంది.
12 కోట్లతో భారీ సినిమా సెట్.. తగ్గేదేలే అంటున్న హీరో..