సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సెలబ్రెటీలలో యాంకర్ అనసూయ ఒకరు. ప్రతి సందర్భంలోనూ ఆమె అభిమానులను పలకరిస్తూ ఉంటారు. భాతర రిపబ్లిక్ డే సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆమె మహాత్మా గాంధీ చిత్రంలో కూడిన టీషర్ట్ను వేసుకుని, వందేమాతరం గేయాన్ని పాడుటూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. కాగా కొంతమంది అసలు జన వరి 26కు గాంధీకి ఏమిటి సంబంధం..? రాజ్యాంగం రాసింది బీఆర్. అంబేడ్కర్ కదా.. నీకు ఈవిషయం కూడా తెలియదా..? అంటూ ట్రోల్ చేశారు.
దీనిపై స్పందించిన అనసూయ తాను పాడింది జాతీయ గీతం కాదని, జాతీయ గేయం అని చెప్పారు. ‘ ఏంట్రా బాబు ఒకడు గాంధీ ఫొటో ఉన్న టీషర్టు ఎందుకు వేసుకున్నావు అంటాడు. ఒకడు వందేమాతరం ఎందుకు కూర్చుని పాడావు అని బుర్రతింటున్నారు. మీకు దండంరా బాబు.. ఏదేమైనా ఎవరి మనసు అయినా గాయ పరిచి ఉంటే సారీ’ అని అనసూయ పోస్ట్ చేశారు.
Also Read: రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుందా..?