Saturday, April 27, 2024
- Advertisement -

ఉద‌య‌భాను సినీ ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం ఏంటి ?

- Advertisement -

తెలుగు బుల్లి తెర‌ను ఒక ఊపు ఊపిన యాంక‌ర్ల‌లో ఉద‌య‌భాను ఒక‌రు. ఒకప్పుడు వ‌రుస టీవీ షోల‌తో ఎంతో బిజీ బిజీగా గ‌డిపిన ఈ యాంక‌ర్ ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. త‌న మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించే ఈ యాంక‌ర్.. ఈ మ‌ధ్య ఒక్క షోలో కూడా క‌నిపించ‌డం లేదు. ఎందుకు ఈ యాంక‌ర్ షోలు, సినిమాల్లోన‌టించ‌డం లేదు అంటే ప‌లుకార‌ణాలు వినిపిస్తున్నాయి.

ఆర్. నారాయణమూర్తి హీరోగా చేసిన ఎర్రసైన్యం సినిమాతో ఉదయభాను కెరీర్ ను స్టార్ట్ చేసింది. తరువాత బస్తీమే సవాల్, కొండవీటి సింహం, ఖైదీ బ్రదర్స్, శ్రావణమాసం వంటి ప‌లు చిత్రాల్లో న‌టించింది. దీంతో మంచి గుర్తింపు సంపాదించింది. త‌రువాత యాంక‌ర్ గా రాణించి మంచి పేరు తెచ్చుకుంది. సాహసం చేయరా డింభకా , వన్స్ మోర్ ప్లీజ్ వంటి షోల‌కు యాంక‌ర్ గా చేసి ఎంతో మందిని మెప్పించింది.

అయితే ఇండస్ట్రీలో ఇంత మంచి పేరు ఉన్న ఉదయభాను గత కొన్ని యేళ్లుగా బుల్లితెరపై కనిపించడం లేదు. దీనికి ఎన్నో కార‌ణాలు ఉన్న‌యంటూ సోష‌ల్ మీడియాలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ యాంక‌ర్ 2004లో విజయ్ కుమార్ అనే వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. 2016 లో వీళ్ల‌కు కవలు జ‌న్మించారు. దీంతో ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఆ పిల్ల‌ల‌ బాగోగులు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నార‌ని స‌మాచారం.

Also Read

నువ్వా..? నేనా ? అంటూ పోటిప‌డుతున్న మ‌హేష్ బాబు, ప్ర‌భాస్

పాపం ఈ అమ్మ‌డి ఆశ‌ల‌న్నీ దానిపైనే..

వాళ్లిద్దరిలో ‘మెగా’ ఛాన్స్ ఎవరికి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -