టాలీవుడ్ సంచలన నటి శ్రీరెడ్డి మరో పోరాటానికి తెర లేపింది.తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి తీవ్ర పోరాటం చేసిన శ్రీరెడ్డి ఈ మధ్య పెద్దగా కనిపించలేదు.తెలుగు వారికి అవకాశం కావలంటే ఇక్కడ పడుకొవలని …పడుకుంటేనే అవకాశాలు ఇస్తారని చెప్పి సంచలన ఆరోపణలు చేసింది. దగ్గుబాటి సురేష్ బాబు కొడుకు అభి రాం తనకు అవకాశాలు ఇస్తానని చెప్పి నన్ను వాడుకుని వదిలేశాడని ఆరోపణలు చేసింది.అభి రాంతో క్లోజ్గా ఉన్న ఫోటోలు కొన్ని మీడియా సాక్షిగా విడుదల చేసింది. ఫిలిం ఛాంబర్ దగ్గర శ్రీరెడ్డి చేసిన అర్థనగ్న ప్రదర్శనతో ఈ వివాదాన్ని తార స్థాయికి తీసుకువెళ్లింది.
ఇంతలో ఏమైందో ఏమో కాని సడన్గా రూట్ మార్చకుని పవన్ టార్గెట్ చేస్తు ..చేసిన కొన్ని కామెంట్ల ద్వారా అప్పటి వరకు శ్రీరెడ్డికి మద్దతు తెలిపిన వారు ఆమెకు దూరం అయ్యారు.పవన్తో పాటు వాళ్ల అమ్మగారిని కూడా బూతులు తిట్టడంతో ఈ వివాదంపై పవన్ కూడా అందోళనకు దిగారు.శ్రీరెడ్డి మాటల వెనుక వివాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఉన్నాడని స్వయంగా వర్మే ఒప్పకొవడం, దీనిని శ్రీరెడ్డి ధృవికరించడంతో ….అప్పటి వరకు శ్రీరెడ్డి చేసిన పోరాటంలో నిజయితి లేదని చాలా మంది భావించారు.దీంతో శ్రీరెడ్డిని ఎవరు పట్టించుకొవడం లేదు.శ్రీరెడ్డి చేస్తున్న ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్లను కూడా పెద్దగా ఎవరు పట్టించుకొలేదు.
దీంతో ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్న శ్రీరెడ్డి మరో పోరాటానికి రెడీ అవుతుంది. మహిళాసంఘాలతో కలిసి శ్రీరెడ్డి అటు రామానాయుడు స్టూడియో దగ్గర లేదా? ఓ డైరక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకు దిగబోతోందని పోలీస్ వర్గాలుకు సమాచారం అందినట్లు బోగట్టా. దీంతో రామానాయడు స్టూడియో దగ్గర భారీ బంధోబస్త్ ఏర్పాట్లుచేసారు.శ్రీరెడ్డి ఉదంతం టీవీ చానెళ్ల పుణ్యమా అని ఉవ్వెత్తున లేచి, అణగారిపోయింది. చానెళ్లు ఏవీ ఇప్పుడు శ్రీరెడ్డిని తమ డిస్కషన్లకు పిలవడం మానేసాయి.ధర్నా చేస్తే కొంతయినా చూపించాలి కదా? ఆ విధంగా మళ్లీ శ్రీరెడ్డి చానెళ్లలో కనిపించే చాన్స్ వుంది. మరి దీనిపై టాలీవుడ్ పెద్దలు ఏవిధాంగా స్పందిస్తారో చూడాలి.