Saturday, April 20, 2024
- Advertisement -

భద్రతా దళాలు కాల్పుల్లో నటికీ తీవ్ర గాయాలు..?

- Advertisement -

ప్రస్తుతం ఇజ్రాయెల్‌, పాలస్తీనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.
ఇరు దేశాలు పరస్పరం రాకెట్ల, బాంబు దాడులతో గత కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇందులో భాగంగా పాలస్తీనా ప్రజలు హైఫా నగరంలో శాంతియుత నిరసన ర్యాలీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాలస్తీనా నటి మైసా అబ్ద్ ఎల్హాది పాల్గొనడం జరిగింది.క్రమంలో ఇజ్రాయెల్ సైనికులు నిరసనకారులపై దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారు. అలాగే ఈ ఘటనలో తాను కూడా గాయపడ్డానని, అసలు ఆ రోజు ఏం జరిగిందో ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది.

ఆదివారం హైఫాలో జరిగిన శాంతియుత నిరసన కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది.మేము నినాదాలు, పాటలు ద్వారా మా కోపాన్ని తెలియజేస్తున్నాం.నిరసన ప్రారంభమైన కొద్దిసేపటికే, సైనికులు గ్రెనేడ్లుతో కాల్చడం ప్రారంభించారు.పరిస్థితి విషమిస్తుందని గ్రహించి నాకారు వైపు నడుచుకుంటూ వెళ్తుండగా పెద్ద శబ్దం వినిపించింది. నా ప్యాంట్‌ ఏమైనా చిరిగిందా ఏంటి అనుకుంటూ,అక్కడ నుంచి ఫాస్ట్‌గా వెళ్లాలని భావించాను.

Also read:బాలయ్యతో నటించాలంటే భయపడ్డనంటున్న బ్యూటీ..?

అయితే నేను నడవలేకపోతున్నాను. కాలు విపరీతంగా నొప్పి పెడుతుంది. ఏం జరిగింది అని వంగి చూడగా నాకాలు చర్మం చీరుకుపోయి విపరీతమైన రక్తస్రావం అవుతుంది. అది చూసి నేను భయంతో కేకలు వేయగ అక్కడ ఉన్న కొందరు నన్ను ఆస్పత్రిలో చేర్చారని తెలిపారు.ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న నటి మైసా తాను కోలుకుంటున్నాని,బాగానే ఉన్నాను అని సోషల్ మీడియాలో ద్వారా తెలిపారు.

Also read:దేశంలో నువ్వే సంపన్నురాలివి తల్లి అంటున్న సోనూసూద్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -