Friday, May 3, 2024
- Advertisement -

కన్నీరు పెట్టిస్తున్న ‘యాత్ర’ సాంగ్‌

- Advertisement -

ఆంధ్ర‌ప్రదేశ్ మాజీ ముఖ్య‌మంత్ర దివంగ‌త నేత డాక్ట‌ర్ వైఎస్ రాజశేక‌ర‌రెడ్డి జీవితంలోని ప్ర‌ముఖ ఘ‌ట్ట‌మైన పాద‌యాత్ర‌ను బేస్ చేసుకుని యాత్ర అనే సినిమాను తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌,ట్రైల‌ర్‌ల‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. దీంతో సినిమాపై అంచ‌నాలు పెరిగిపోయాయి. ఈ అంచ‌నాల‌ను పెంచేస్తుంది సినిమాలోని సాంగ్‌. గ‌త రాత్రి(మంగ‌ళ‌వారం) విడుద‌ల చేసిన మరుగైనావా రాజన్న.. కనుమరుగైనావా రాజన్న అంటూ సాగే ఓ పాట‌ను విడుద‌ల చేశారు చిత్ర యూనిట్‌. ఈ పాట విన్న ప్ర‌తి ఒక్క‌రికి కంట క‌న్నీరు వ‌స్తోంది. రాజన్న మరణంతో శోక సంద్రంలో మునిగిన ఎంతో మంది ప్రజల గుండెల్లోని బాధ‌ను ఈ సాంగ్‌లో పొందుప‌రిచారు.

రెండ‌వ సారి సీఎం అయిన త‌రువాత రచ్చబండ కార్య‌క్ర‌మానికి బ‌య‌లుదేరిన వైఎస్ఆర్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన సంగ‌తి తెలిసిందే. వైఎస్ఆర్ చ‌నిపోయినప్పుడు ప్ర‌జ‌ల‌లోని భావాల‌ను ఈ పాట‌లో చూపించిన‌ట్లు తెలుస్తోంది. నాని కృష్ణార్జున యుద్ధం సినిమాలోని దారి చూడు ద‌మ్ము చూడు సాంగ్ పాడిన పెంచల్‌ దాస్ స్వ‌యంగా పాట రాసి పాడ‌టం విశేషం. త‌న గాత్రంతో పాట‌కు ప్రాణం పోశాడు పెంచల్‌ దాస్. ఆనందో బ్రహ్మ’ ఫేమ్‌ మహి వి. రాఘవ్‌ దర్శకత్వం వ‌హించిన ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు,అన‌సూయ కీలక పాత్ర‌ల్లో న‌టించారు. ఇక ఈ సినిమాను వ‌చ్చే నెల‌(ఫిబ్ర‌వ‌రి) 8న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు మ‌ళ‌యాళంలో విడుద‌ల చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=UFP6ZPWSDW8

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -